మహేష్ బాబు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. భరత్ అనే నేను.. మహర్షి మంచి విజయాలు సాధించాయి. ఈ రెండు విజయాలతో మహేష్ తిరిగి ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై మంచి హోప్స్ ఉన్నాయి. దిల్ రాజు, అనిల్ సుంకరలతో పాటు మహేష్ బాబు కూడా ఈ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో రష్మిక కీ రోల్ ప్లే చేస్తున్నది.
ఇప్పటి వరకు సీరియస్ సినిమాలు చేసిన మహేష్.. సరిలేరు నీకెవ్వరూతో పక్కా ఎంటర్టైనర్ ను ఇవ్వబోతున్నారు. సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉండబోతున్నది. ఇక ఫస్ట్ టైం మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తారట. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన మహేష్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
మహేష్ బాబు ఈ విదేశీ పర్యటన చాలా స్పెషల్ అని చెప్పారు. ఒకటి మహర్షి విజయం కాగా రెండోది తన కొడుకుతో కలిసి క్రికెట్ మ్యాచ్ ను లైవ్ లో చూడటం అని చెప్పారు. బాలీవుడ్ సినిమాల గురించి చెప్తూ.. బాలీవుడ్ లో నటించే సమయం లేదని, బాలీవుడ్ లో చాలామంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారని, ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయని, బాలీవుడ్ ఆలోచన లేదని చెప్పారు మహేష్.