నిన్నటి తరం కథానాయకుడిగా మురళీమోహన్‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఉంది. వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌న ప‌ని తాను చేసుకుని పోయే ముర‌ళీమోహ‌న్ సినిమాల్లో ఎలా స‌క్సెస్ అయ్యారో వ్యాపారంతో పాటు రాజ‌కీయాల్లోనూ స‌క్సెస్ అయ్యారు. ముర‌ళీమోహ‌న్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచిన సంగ‌తి తెలిసిందే. 


ఇక వ‌యోఃభారంతో ఆయ‌న రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవ‌ల ఆప‌రేష‌న్ చేయించుకున్న ఆయ‌న తిరిగి యాక్టివ్ అవ్వ‌డంతో పాటు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాల‌ను ఆయ‌న ఇప్పుడు బ‌య‌ట పెడుతున్నారు. 


తాను హీరోగా ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడు హీరోయిన్ జ‌య‌చిత్ర‌ను పెళ్లి చేసుకుంటాన‌ని ఓ త‌మిళ ప‌త్రిక రాసింద‌ని చెప్పారు. తాను గాసిప్‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకునే వాడిని కాద‌ని.. జ‌య‌చిత్ర‌తో తాను వ‌రుస పెట్టి సినిమాలు చేయ‌డంతో ఆ ప‌త్రిక ఈ వార్త అల్లేసింద‌ని ఆయ‌న చెప్పారు. చివ‌ర‌కు ఈ వార్త బాగా వైర‌ల్ అవ్వ‌డంతో తాను వాళ్లకి నోటీసులు పంపించడంతో వచ్చి సారీ చెప్పార‌ని ఆయ‌న చెప్పారు.


ఇక సినిమాల్లో ఉన్న‌ప్పుడు ఇలాంటి రాత‌లు స‌హ‌జ‌మ‌ని.. వాటిని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన ప‌నిలేద‌ని స‌న్నిహితులు చెప్ప‌డంతో అప్ప‌టి నుంచి గాసిప్‌ల‌ను తాను ప‌ట్టించుకోవ‌డం మానేశాన‌ని ముర‌ళీమోహ‌న్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: