ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా.  తెలుగు లోనే కాదు తమిళ, మళియాళ, హిందీ భాషల్లో కూడా తన సత్తా చాటుతుంది తమన్నా.  ఆ మద్య సినిమా అవకాశాలు తగ్గడంతో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది.  ఇక బాహుబలి సినిమా లో దేవకన్యలా కనిపించిన తమన్నాకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. 

బాలీవుడ్ లో ఈ మద్య వరుస సినిమాలు వస్తున్నాయి.  ప్రభుదేవా - తమన్నా కాంబినేషన్ లో అభినేత్రి సినిమా హర్రర్ కాన్సెప్ట్ తో వచ్చింది.  ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈ మద్య అభినేత్రి 2 సీక్వెల్ గా తీశారు..కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  తాజాగా  మిల్కీ బ్యూటీ తమన్నా ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. జుహు-వెర్సోవా లింక్ రోడ్ లో ఉన్న 'బేవ్యూ' అనే 22 అంతస్తుల భవంతిలో 14వ అంతస్తులోని ఫ్లాట్ ని రూ.16 కోట్లు పెట్టి తమన్నా కొనుక్కుందట. 

కాకపోతే ఈ విషయంపై తమన్నా కానీ..ఆమె తరుపు నుంచి ఎవరూ అఫిషియల్ గా ఎక్కడా వెల్లడించలేదు. చదరపు గజానికి రూ.80,778 చెల్లించి ఈ ఇంటికి మొత్తంగా పదహారు కోట్లకు కొనుక్కుంది, నిజానికి ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ధరలకు ఇది రెండు రెట్లు కంటే అధికమని చెబుతున్నారు.  ప్రస్తుతం ఈ బ్యూటీ 'క్వీన్' తెలుగు రీమేక్ 'దటీజ్ మహాలక్ష్మి'లో నటిస్తోంది. అలానే మెగాస్టార్ 'సై రా'లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలానే 'రాజు గారి గది 3'కి కూడా సైన్ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: