30 ఇయర్స్ పృథ్వి ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు, వార్నింగ్స్ కు గురవ్వడం కొత్తేంకాదు. జనాలతో ఏదోరకంగా తిట్టించుకుంటూనే ఉంటాడు. పెద్ద హీరోల్ని ఇమిటేట్ చేస్తూ ఇతర సినిమాల్లో పృథ్వి చేసే యాక్టింగ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్వయంగా బాలయ్య, పృథ్వికి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ సారీ తన నెక్ట్స్ సినిమాకు ముందే జాగ్రత్తపడ్డాడు.


ఆది సాయి కుమార్ హీరోగా నటించిన బుర్రకథ సినిమాలో ఓ కామెడీ రోల్ లో నటించాడు పృథ్వి. ఇందులో సాహో టీజర్ ను ఇమిటేట్ చేశాడు. "ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్" అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను పృథ్వితో చెప్పించారు. పనిలోపనిగా అరవింద సమేతలో ఎన్టీఆర్ చేసిన యాక్టింగ్ ను కూడా ఇమిటేట్ చేశారు. అయితే దీని గురించి ఈ సినిమా విడుదలకు ముందే ప్రభాస్, ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కి క్లియర్‌గా ఓ క్లారిటీ ఇచ్చుకున్నాడు 30 ఇయర్స్ పృథ్వి.  


"డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగ్ ను దర్శకుడు సరదాగా పెట్టుకున్నాడు. కథలో నా క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. టీజర్ లో డైలాగ్ చూసి ఏదేదో ఊహించుకోకండి. నన్ను తిట్టకండి.. అలాంటిదేం కాదు. కథలో నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటూ ముందుగానే వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు పృథ్వి. ప్రభాస్, ఎన్టీఆర్ ను కించపరిచేలా తమ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉండవని, ఇలాంటి విషయాల్లో రిలీజ్ కు ముందే అసలు విషయాన్ని లీక్ చేస్తే బెటరని అభిప్రాయపడ్డాడు పృథ్వి. సో.. ఈసారి ప్రభాస్, ఎన్టీఆర్  ఫ్యాన్స్ నుంచి పృథ్వికి వ్యతిరేకత రాకపోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: