ఆస్ట్రేలియాలో సాంగ్ షూట్ పూర్తి చేసుకుని తాజాగా హైదరాబాద్ లో అడుగు పెట్టాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రభాస్ బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆగస్టు 15 రిలీజ్ లక్ష్యంగా సుజీత్- యువి క్రియేషన్స్ బృందం అన్ని పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఈలోగానే డార్లింగ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ లీకైంది.

 

సాహో ఆగస్టులో రిలీజవుతుంటే `జాన్` మూవీని 2020 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సాహో షూటింగ్ ఇప్పటికే పూర్తయింది కాబట్టి ప్రభాస్ తదుపరి జాన్ చిత్రీకరణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. అలాగే జాన్ తర్వాత నటించబోయే సినిమాకి తాజాగా కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.

 

ప్రభాస్ ఎలానూ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడే కథ వింటారని చెబుతున్నారు. ఈ సోమవారం లేదా బుధవారం ప్రభాస్ కథ వినే ఛాన్సుందట. అంతేకాదు.. ఈసారి వినే కథ కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్నదేనని తెలుస్తోంది. సాహో.. జాన్ లాంటి యూనిక్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటి రేంజుకు తగ్గని కథనే ఈసారి కూడా ఎంచుకుంటున్నాడట.

 

అంతేకాదు.. ఈ కథ తొలుత కేజీఎఫ్ హీరో యశ్ దగ్గరకు వెళ్లింది. కానీ అలాంటి స్టోరీకి ప్రభాస్ రేంజు హీరో అయితేనే సూటవుతాడని అతడు సిఫారసు చేశాడట. ఆ కథను యు.వి.క్రియేషన్స్ - ప్రభాస్ బృందానికి వినిపించాల్సిందిగా యశ్ కోరారని తెలిసింది. ప్రస్తుతం సదరు కన్నడ టాప్ డైరెక్టర్ యు.వి.క్రియేషన్స్ బృందానికి కథ వినిపించేశారు. ప్రభాస్ కి వినిపించేందుకు వేచి చూస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: