కుమార్తెను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి కమ్ బిగ్ బాస్ తమిళ వెర్షన్ లో కంటెస్టెంట్ గా వ్యవహరిస్తున్న  వనిత.. ఆ కేసు నుంచి బయటపడినట్లేనని చెబుతున్నారు. స్కూల్ నుంచి వెళ్లిన తన కుమార్తె జోనితను తన మాజీ భార్య కిడ్నాప్ చేసినట్లుగా హైదరాబాద్ కు చెందిన మాజీ భర్త ఆనంద్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయటం తెలిసిందే.

 

దీంతో తెలంగాణ పోలీసుల బృందం చెన్నై వెళ్లింది. బిగ్ బాస్ షోలో ఆమె పార్టిస్టిపేట్ చేస్తున్న నేపథ్యంలో ఆమెను విచారించాలని కోరారు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వనితను రెండు గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా తాను తన కుమార్తెను కిడ్నాప్ చేయలేదన్నారు.

 

కావాలంటే సాయంత్రం ఐదు గంటలకు తన కుమార్తెను పోలీసుల ముందుకు హాజరుపరుస్తానని పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లే కుమార్తెను తెలంగాణ పోలీసుల ఎదుట హాజరుపర్చటం.. వారితో పాటు వనిత న్యాయవాది కూడా ఉన్నారు. తన ఇష్టంతోనే తల్లి వద్దకు వచ్చానే తప్పించి.. తననేమీ బలవంతంగా తీసుకురాలేదంటూ స్పష్టం చేసింది.

 

అంతేకాదు.. తాను తన తల్లి దగ్గర ఉండేందుకే ఇష్టపడుతున్నట్టుగా పేర్కొందట. ఈ నేపథ్యంలో వనిత తప్పు ఏమీ లేదని పోలీసులు తేల్చారు. దీంతో కేసు నుంచి బయటపడిన ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు. కూతురి వలన కేసు నుండి బయటపడినందుకు ఆమె మిక్కిలి సంతోషాన్ని ప్రదర్శిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: