స్టార్ హీరోల సినిమాలకు ఆసినిమాల విడుదల సమయంలో భారీ కటౌట్లు పెట్టడం ఆ కటౌట్లకు పెద్ద దండలు వేసి పాలాభిషేకాలు చేయడం గతంలో చాల ఎక్కువగా కనిపించేది. అయితే ఇప్పుడు కొంత వరకు ఆ మ్యానియా తగ్గింది. ఇలాంటి సమయంలో నిన్న విడుదలైన ‘ఓ బేబి’ సినిమాకు సంబంధించి 50 అడుగుల భారీ కటౌట్ హైదరాబాద్ లోని ఆర్టీసి క్రాస్ రోడ్ దగ్గర ఉండే ఒక ధియేటర్ వద్ద ఏర్పాటు చేసిన విషయం సంచలనంగా మారింది.

దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో కూడ అక్కడక్కడా కొన్ని ధియేటర్ల దగ్గర సమంత కటౌట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఈవిషయాలు సమంత దృష్టి వరకు వెళ్ళడంతో ఆమె ఆశ్చర్యపోయి ఈవిషయమై నాగచైతన్యను సంప్రదించినట్లు టాక్. 

సినిమా సక్సస్ కావడం కలక్షన్స్ రావడం ముఖ్యం కాని తనకు టాప్ హీరోలతో సమానంగా ఇలాంటి భారీ కటౌట్ల ఏర్పాట్లు చేసింది ఎవరు అంటూ ఆమె తన ఆశ్చర్యాన్ని వ్యక్త పరచడమే కాకుండా ఇలాంటి విషయాలు హీరోలకు బాగుంటాయి కాని తనకెందుకు అంటూ చైతన్యతో జోక్ చేసినట్లు టాక్. ఈ కటౌట్ల వ్యవహారం అంతా నాగార్జున చైతన్య అభిమానులు చేసారు అన్న విషయం వెలుగులోకి రావడంతో ఇలాంటి కటౌట్ల బదులు ఆడబ్బుతో చిన్న సేవా కార్యక్రమాలు చేయవచ్చు కదా అంటూ ఆ అభిమానసంఘాలకు సమంత సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘ఓ బేబి’ మూవీకి తెలుగు రాష్ట్రాల సగటు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ మూవీ సెకండ్ ఆఫ్ మరీ పెద్దది అయిపోవడంతో పాటు ఈమూవీలో చిత్రీకరించిన కొన్ని కీలక సన్నివేశాలకు లాజిక్ మిస్ అయింది అంటూ సగటు ప్రేక్షకుడు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ‘ఓ బేబి’ ఎంతవరకు సూపర్ హిట్ అవుతుంది అన్న విషయమై సందేహాలు కొనసాగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: