అనిల్ రావిపూడి మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో కూడ సగటు ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకునే సన్నివేశాలు ఉండే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి తన మార్క్ ను ఈ మూవీ పై వెయబోతున్నాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో అత్యంత కీలకంగా ఉండబోయే రైలు కామెడీ సీన్  గురించి ఇప్పటికే లీకులు వచ్చాయి. 

దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో శ్రీనువైట్ల దగ్గర సహాయకుడుగా పనిచేసిన రోజులలో తీసిన శ్రీనువైట్ల తీసిన వెంకీ సినిమాలోని ట్రయిన్ కామెడీ సీన్ ను మళ్ళీ ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం   అనిల్ రావిపూడి రిపీట్ చేయబోతున్నట్లు స్పష్ట మైన సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కాశ్మీర్ లో మిలటరీ మేజర్ గా పనిచేసే హీరో ఆంధ్రాకు ట్రైన్ లో బయలుదేరుతాడు.  

ఆ సందర్భంగానే ఈ కామెడీ సీన్లు ఉంటాయట. కాశ్మీర్ నుంచి ఆంధ్రా వరకు ట్రయిన్ జర్నీ అంటే చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఈ సీన్ చాల పెద్దదిగా ఈమూవీ ఫస్ట్ ఆఫ్ లో వస్తుందని సమాచారం. ఈ ట్రయిన్ ఎపిసోడ్ లోనే బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రముఖ కమెడియన్స్ ఈ కామెడీ సీన్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సీన్ కోసం సుమారు పది రోజుల సమయం పడుతుంది కాబట్టి అన్ని రోజులు నిజమైన ట్రైన్ ను అద్దెకు తీసుకోవడం కష్టం అని భావించి అన్న పూర్ణ స్టూడియోస్ లో దీనికోసం ప్రత్యేకమైన ట్రైన్ సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఈ ట్రైన్ సెట్ కోసం భారీ బడ్జెట్ కూడ పెడుతున్నట్లు టాక్. అయితే ఇప్పటికే అనేక మంది అనేక సార్లు ‘వెంకీ’సినిమాలోని ఆ ట్రైన్ కామెడీని బుల్లితెర పై పలుసార్లు వస్తున్నప్పుడు ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ అదే సీన్స్ అనీల్ రావిపూడి రిపీట్ చేస్తే ఆదరిస్తారా అన్నదే ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: