ఒకప్పుడు రకుల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. వరసగా టాప్ హీరోలతో సినిమాలు చేసింది. ఆమె దురదృష్టం ఏమంటే.. సినిమాలు చేసినా అవి హిట్ కాలేదు. చిన్న హీరోలతో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. పెద్ద హీరోలతో చేసినవే బెడిసికొట్టాయి.
అయితే అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో చేసిన దే దే ప్యార్ దే సినిమా హిట్ కొట్టడంతో.. మరలా ఆమె కెరీర్ పుంజుకుంది. హైదరాబాద్ తో ముంబై పరుగులు తీస్తోంది. రీసెంట్ గా కియారా ముంబైలో ఫార్మర్ కేర్ కు వెళ్ళింది. అక్కడి నుంచి బయటకు రాగానే రోడ్డుపై ఉన్న పిల్లలు మహిళలు చుట్టుముట్టారు.
ఆకలితో ఉన్నామని, కొంత డబ్బు ఇవ్వాలని చుట్టుముట్టారు. దీంతో రకుల్ షాక్ అయ్యింది. వాళ్ళ నుంచి తప్పించుకోలేకపోయింది. ఎంత వారిస్తున్నా వినలేదు. ఈలోగా రెస్టారెంట్ సిబ్బంది బయటకు వచ్చి వాళ్ళను కంట్రోల్ చేయడంతో ఆమె కారెక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే.. రకుల్ ఆ పిల్లలకు డబ్బులు ఇచ్చిందా లేదా..
ఇస్తే మంచి మనసును చాటుకున్నట్టే. లేదంటే పాపం వాళ్ళ మనసులు గాయపడి ఉంటాయి. ప్రస్తుతం రకుల్ తెలుగులో నాగార్జున తో మన్మధుడు 2 చేస్తోంది. ఈ మూవీ ఆగష్టు 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. దీనికి పాజిటివ్ వైబ్ నడుస్తున్నది. ఈ ఇనిమ హిట్టయితే రకుల్ మరలా లైన్లోకి వచ్చినట్టే.