తెలుగు సినిమాల టైటిల్ చాలా కొత్తగా ఉంటున్నాయి. ఈ మధ్య వస్తున్న చాలా చిత్రాలకు విభిన్నమైన టైటిల్స్ పెట్టి ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. సుంకర బ్రదర్స్ పతాకంపై.. భాస్కరరావు, శ్రీమతి ఆదిలక్ష్మిల సమర్పణలో సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ధమ్కీ’. రజిత్, త్రిషాలాషా జంటగా నటించగా ఏనుగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.

 

ప్రస్తుతం చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా సినిమా సరికొత్తగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. శ్రీమణి సాహిత్యం అందిస్తున్న ఈ సినిమాకి ఎస్.బి ఆనంద్ సంగీతం, దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ.. ‘‘ధమ్కీ చిత్రం వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు ఈ జోనర్‌లో కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి.

 

ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. అందరినీ ఈ సినిమా ఆద్యంతం అలరిస్తుంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నిర్మాత సత్యనారాయణగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు షూట్ చేస్తున్నాము..’’ అన్నారు.నిర్మాత సత్యనారాయణ సుంకర మాట్లాడుతూ.. ‘‘ధమ్కీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్ చేస్తాం. ఈ సినిమా కథ చాలా బాగా నచ్చి సినిమాని ప్రొడ్యూస్ చేశాను.

 

దర్శకుడు ఏనుగంటి కూడా చాలా బాగా తెరకెక్కించారు. కొన్ని కొన్ని సీన్స్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.ఈ మధ్య వస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ అన్ని నిజ జీవితంలో నుండి ప్రేరణ పొందినవే ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రేక్షకుడికి వాటిని నచ్చేలా తీర్చి దిద్దడం చాలా కష్టం. మరి "ధమ్కీ" చిత్రం ఏ విధంగా ప్రేక్షకుడిని ఆకర్షిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: