తెలుగులో విభిన్నమైన కథానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రానా ఒక్కడనే చెప్పాలి. దానికి కారాణం ఆయన ఎంచుకునే కథలే. పాత్ర ఏదైనా దానిలో విలక్షణత ఉండేలా చూసుకుంటాడు. తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పర్చుకున్నాడు. బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నాడు.

 

అందుకే అటు ముంబయి నుండి ఇటు హైదరాబాద్ వరకు రానా మోస్ట్ వాంటెడ్ యాక్టర్. హిందీలో డిపార్ట్ మెంట్, బేబి సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం "హాథీ మేరె సాథి" అనే పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. దీనిలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే వాడిలా రానా కనిపించనున్నాడు. ముందే చెప్పినట్టు రానా ఎంచుకునే కథలు యూనివర్సల్ ఆక్సెప్టెన్సీ ఉంటాయి. తన స్టోరీ సెలెక్షన్ తో ప్రాంతీయ హద్దులని చెరిపేస్తున్నాడు.

 

యాక్టర్‌గా కొత్త కొత్త కథలను చెబుతున్న రానా నిర్మాతగా మారి మరిన్ని కథలను స్క్రీన్‌ మీదకు తీసుకురావాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆల్రెడీ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌  మీద వచ్చిన కొన్ని సినిమాలకు రానా సమర్పకుడిగా వ్యవహరించారు.  కేరాఫ్ కంచరపాలెం సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించి, ప్రమోషన్ బాధ్యతలని తన మీద వేసుకున్నాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.

 

ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారడానికి సిద్ధమవుతున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా అనీష్ క్రిష్ణ దర్శకత్వంలో  ఓ చిత్రం నిర్మించనున్నారట. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ జరుగుతుందని, ఈ సినిమా  హిందీ డ్రీమ్ గాళ్ చిత్రానికి రీమేక్ అని తెలిసింది. అయితే రాజ్ తరుణ్ కి ప్రస్తుతం అన్ని ఫ్లాపులే ఉన్నాయి. మరి రానా రాజ్ తరుణ్ ని ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: