గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల  సినిమాలైన భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విడుదల విషయమై చిన్న సమస్యలు తలెత్తడంతో కొందరు టాలీవుడ్ పెద్దలతో కలిసి ఆ రెండు సినిమాల నిర్మాతలు చివరికి రాజీకి వచ్చి తమ రెండు సినిమాలను 15 రోజుల గ్యాప్ తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక మళ్ళి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు హీరోల సినిమాల మధ్య మరొక యుద్ధం పక్కాగా కనపడుతోంది . ఓవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంటే, 

నిన్నటినుండి మంచి జోష్ తో మహేష్, అనిల్ రావిపూడిల సినిమా కూడా షూటింగ్ ప్రారంభించడం జరిగింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసాయి. నిజానికి అల్లు అర్జున్ సినిమా ప్రారంభ సమయంలో వాళ్ళు దసరా నాటికి సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని భావించారు, అయితే షూటింగ్ లో కొంత జాప్యం కారణంగా తమ సినిమాని సంక్రాంతికి వాయిదా వేయడం జరిగింది. ఇక మహేష్, అనిల్ రావిపూడి సినిమాని పూజ కార్యక్రమాల సమయంలోనే సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అంతేకాక ఈ రెండింటితో పాటు బాలయ్య, రజినీకాంత్ సినిమాలో కూడా సంక్రాంతి బరిలో నిలుస్తున్నట్లు సమాచారం. 

ఇక ఇప్పటికే ఒకసారి అతితక్కువ గ్యాప్ తో బరిలోకి దిగిన ఈ ఇద్దరు సూపర్ స్టార్లు, మరొక్కసారి బాక్సాఫీస్ యుద్దానికి సిద్దము అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రెండు సినిమాల విషయంలో కనీసం 15 రోజలు గ్యాప్ ఉంటె బెటర్ అని సినీ విశ్లేషకులు చెప్తున్నప్పటికీ, సంక్రాంతి సమయంలో విడుదల అయితేనే మంచి కలెక్షన్లు వస్తాయని భావిస్తున్న ఈ రెండు సినిమాల నిర్మాతలు, తమ సినిమాలను అతి కొద్ది గ్యాప్ లోనే విడుదల చేసే పరిస్థితులు కనపడుతున్నాయని అంటున్నారు. మరి అప్పటి పరిస్థితులను బట్టి రెండు సినిమాలు ఒకేసారి విడుదలువుతాయా, లేక కాస్త గ్యాప్ తో వస్తాయా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: