ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికాలోని తానా సభల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లడం జరిగింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఇకపై పార్టీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని గట్టిగా కంకణం కట్టుకున్న పవర్ స్టార్, రాబోయే రోజుల్లో పూర్తిగా తన సమయాన్ని పార్టీకి మరియు ప్రజలకే పరిమితం చేయనున్నారు. ఇక పవన్ అమెరికా చేరుకున్న సమయంలో అయన మళ్ళి సినిమాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ ఒత్తిడి చేశారట. 

అయితే తాను ఇకపై ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని అనుకుంటున్నట్లు పవన్ వారికి సున్నితంగా సమాధానము చెప్పారట. నిజానికి పవన్ నటించిన లాస్ట్ సినిమా అజ్ఞాతవాసి మంచి హైప్ తో రిలీజ్ అయి అంచనాలను అదనుకోలేక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కాబట్టి ఆ సినిమాపై అంత హైప్ ఏర్పడింది. ఇక అజ్ఞాతవాసి డిజాస్టర్ తరువాత పవన్, మైత్రి మూవీ మేకర్స్ వారికీ ఒక సినిమాకు పనిచేయాల్సి ఉంది, అయితే అప్పటికే తన రాజకీయ కార్యక్రలాపాల్లో బిజీ అయిన పవన్, ఆ సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు అయన ఫ్యాన్స్ అంటున్న మాటేమిటంటే, మాకోసం కళ్యాణ్ గారు ఒక్క హిట్ సినిమా చేస్తే చాలు, ఎప్పటికీ దానిని గుర్తుంచుకుంటాం అంటున్నారు. 

అయితే అది ఇప్పటిపరిస్థితుల్లో కుదిరే అవకాశం లేదని తెలుస్తోంది. ఇటీవల అయన బ్రదర్ నాగబాబు కూడా పవన్ ఇకపై సినిమాలు చేయరని ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కొందరు మాత్రం అయన మళ్ళి త్వరలో సినిమాల్లోకి వస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అయితే భవిష్యత్తులో ఏదైనా అతిథి పాత్రలో నటించే అవకాశం మాత్రం లేకపోలేదని, మరి అది ఎప్పుడు వస్తుందో వేచిచూడాలని అంటున్నారు. మరి ఇకనైనా పవన్ సినిమాల్లోకి ,మళ్ళి రి ఎంట్రీ ఇస్తున్నారు అనే రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: