తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుని ఆతరువాత అతడితో విడిపోయి ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్న అమలా పాల్ స్పీడ్ చూసి కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఎలాంటి బోల్డ్ సీన్స్ లో అయినా నటించడానికి రెడీ అంటున్న ఈమె లేటెస్ట్ మూవీ ‘ఆడై’ త్వరలో విడుదల కాబోతోంది. ఈమూవీని ‘ఆమె’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. 

ఇప్పటికే సంచలనాలకు చిరునామాగా మారిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమూవీలో కామిని అనే విచిత్ర మనస్తత్వం గల పాత్రలో నటిస్తున్న ఈమూవీ గురించి ఆమె వివరిస్తూ ఈమూవీ షూటింగ్ లో తాను నగ్నంగా నటించినప్పటికీ తాను చాల సెక్యూర్ గా ఫీల్ అయ్యానని కేవలం తాను నగ్నంగా నటిస్తున్న సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న 15 మంది టెక్నీషియన్స్ తనను బాగా చూసుకోవడంతో తాను 15 మంది భర్తలు కలిగిన మహిళ అన్న ఫీలింగ్ కలిగింది అని  కామెంట్ చేసింది. 

ఈసినిమాకు సంబంధించిన తన పాత్రలో అబ్బాయిలతో కలిసి తిరుగుతూ మద్యపానం చేస్తూ మహిళగా తనకు లభించిన స్వేచ్చను దుర్వినియోగం చేసుకున్న ఒక పాత్రలో తాను నటిస్తున్న విషయాలను వివరించింది. అంతేకాదు తాను నటించే కామిని పాత్ర ఆలోచనలలో పుట్టుకతో బట్టలు వేసుకుని పుట్టనప్పుడు మధ్యలో బట్టలు విప్పేసి నగ్నంగా ఉంటే తప్పు ఏమిటి అని అమలా పాల్ అన్న డైలాగ్ తో విడుదల చేయబడ్డ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. 

ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో ఈమూవీ తెలుగు డబ్బింగ్ కు కూడ మంచి మార్కెట్ ఏర్పడే ఆస్కారం ఉంది. ఈమూవీలోని అమలా పాల్ పాత్రకు అవార్డులు రావడం ఖాయం అంటూ అప్పుడే కోలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: