గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పేరు బాగా వినిపించింది. ముఖ్యంగా పవన్, నాగబాబుపై కామెంట్స్ చేసి మరింత హైలైట్ అయ్యాడు. దీంతో మెగా ఫ్యాన్స్ కు ఆయనకు మధ్య వార్ కూడా నడిచింది. ప్రజారాజ్యం సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు ప్రజారాజ్యం అధికార ప్రతినిధిగా పనిచేశాడు. ఇప్పుడు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు. సినిమాలపరంగా మెగా కుటుంబమంటే అభిమానం చూపే పృథ్వీ రాజకీయాల్లో మాత్రం విభేదించాడు.

 

 

ముఖ్యంగా మెగా కుటుంబంపై చిన్నపాటి మాటల దాడే చేశాడు. దీనిపై నాగబాబు ఒక ఇంటర్వూలో “ఒరేయ్ పృథ్వీ నువ్ నాకు ఫోన్ చెయ్..” అంటూ స్ట్రైట్ వే ఆర్డర్ కూడా చేశాడు. ఈ గొడవ మేమిద్దరం క్లియర్ చేసుకున్నామని పృథ్వీ మరో ఇంటర్వూలో చెప్పాడు.. మరీ ఆ విషయాన్ని అల్లరి చేయకుండా. దీంతో పృథ్వీకి మెగా హీరోల సినిమాల్లో చాన్సులు ఇవ్వట్లేదని వార్తలు గుప్పుమన్నాయి. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ లో కూడా పృథ్వీ ని బన్నీ వద్దన్నాడని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై పృథ్వీ స్పందిస్తూ ”తాడేపల్లిగూడెం నుంచి సూట్ కేస్ తో మద్రాస్ వెళ్లింది మెగా హీరోలు అవకాశాలు ఇస్తారని కాదు” అని మెగా ఫ్యామిలీని, ఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు.

 

 

ఈ నిప్పు చల్లారక ముందే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరాలో పృథ్వీ చేసిన సీన్లు కట్ చేస్తున్నారు అనే వార్త ఫిల్మ్ నగర్ లో స్ప్రెడ్ అయింది. మరి ఈ విషయంపై పృథ్వీని క్లారిటీ తీసుకోగా “చిరంజీవి గారంటే నాకు అభిమానం, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఇలాంటి సిల్లీ థింగ్స్ పట్టించుకోరనే అనుకుంటున్నాను” అన్నాడు. గతంలో ఖైదీ నెం.150లో కూడా పృథ్వీ సీన్స్ తీసేసారనే వార్తలు వచ్చినా అవి అబద్ధమయ్యాయి. మరి.. సైరా లో పృథ్వీ సీన్స్ విషయంలో ఎంత నిజముందో సినిమా రిలీజైతే గానీ తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: