నా పేరు సూర్య సినిమా తరువాత దాదాపు సంవత్సరం పాటు మరే సినిమా చేయకుండా ఖాళీగానే ఉన్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జూలాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి రెండు సూపర్ హిట్లు వచ్చాయి. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా షెడ్యూల్స్ లేని సమయాల్లో అల్లు అర్జున్ విడుదలైన సినిమాలు చూస్తూ ఆ చిత్రాలపై ప్రశంసలు కురిపిస్తున్నాడు.

 

గతవారం విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచేవారెవరురా రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలను అల్లు అర్జున్ వీక్షించాడు. మొదట ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా కామెడీతో కూడిన థ్రిల్లర్ సినిమా అని ప్రతిభ కలిగిన కొత్త తరం నటులు, దర్శకులు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెడున్నారని ఇలాంటి వారిని చూడటం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

 

మరో సినిమా బ్రోచేవారెవరురా గురించి మాట్లాడుతూ సినిమా చివర్లో చాలా థ్రిల్లింగ్గా ఉందని, సినిమాలో కామెడీ చాలా బాగుందని ప్రశంసించారు. సినిమాలో నటించిన నటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు చాలా బాగా పని చేసారని అన్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ స్టార్ హీరోలు ఇలాంటి చిన్న సినిమాల్ని చూసి ప్రోత్సహించడం అభినందించదగిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: