తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. స్టార్ హీరో ఎన్టీయార్ ఆ షోను హోస్ట్ చేయడంతోపాటు బిగ్ బాస్ షోపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేసాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్ట్ చేయగా సీజన్ 2 యావరేజ్గా మిగిలింది. నాని సీజన్ 3 హోస్ట్ చేయడానికి నో చెప్పడంతో బిగ్ బాస్ సీజన్ 3 కు స్టార్ మా ప్రతినిధులు నాగార్జునను ఒప్పించారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో ప్రేక్షకులకు దగ్గరైన నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఈ షోపై అంచనాలు పెరిగాయి. 
 
గతంలో సెలబ్రిటీల విషయంలో అంతగా ఆకట్టుకోలేకపోయిన బిగ్ బాస్ ఈసారి మాత్రం టాప్ రేంజ్ సెలబ్రిటీలనే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. వీ6 ఛానెల్లో తీన్మార్ ప్రోగ్రామ్లో కనిపించే సావిత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ బిగ్ బాస్ షోలో పాల్గొనబోతుందట. స్టార్ యాంకరైన శ్రీముఖి కూడా భారీ రెమ్యూనరేషన్తో బిగ్ బాస్ షోలో పాల్గొనబోతుందని ఇప్పటికే ఒప్పందం కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. 
 
ఇక తెలుగులో హీరోగా వెలుగు వెలిగి ప్రస్తుతం అవకాశాల్లేని వరుణ్ సందేశ్ కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నాడట. ఉయ్యాల జంపాల సినిమాలో అవికాగోర్ స్నేహితురాలిగా నటించిన అమ్మాయి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. వీరు మాత్రమే కాక సింగర్ హేమచంద్ర, నటుడు తరుణ్, క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ, పలు సీరియల్స్లో నటిస్తున్న జాకీ బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: