తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా సినిమా ను కబీర్ సింగ్ గా సందీప్ రెడ్డి వంగా నే హిందీలో కూడా డైరెక్ట్ చేశాడు. షాహిద్ కపూర్ హీరో నటించిన ఆ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇటివలే రిలీజైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాపై దర్శకుడికి, నటీమణులకు, పలువురు మహిళలకు మధ్య వార్ నడుస్తోంది.

 

ఓ ఇంటర్వూలో సందీప్‌ చేసిన వ్యాఖ్యలపై సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా తదితరులు సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న మీ మాటలకు బాధపడుతున్నాం. మీ వ్యాఖ్యలను ఏ విధంగా సమర్ధించుకుంటారు అని మండిపడ్డారు. దీనిపై తాజాగా సందీప్ క్లారిటీ ఇచ్చారు.  ‘నన్ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ ఉండదని అన్నాను. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

 

 హిందీలోనూ మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల వసూళ్లను దాటి దూసుకెళ్తోంది. సినిమాలో హీరో, హీరోయిన్ చెంపపై కొట్టే సన్నివేశం గురించి సందీప్‌ ను ఓ విలేఖరి ప్రశ్నించగా.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకరికి ఒకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: