సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సూపర్ సూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనకు అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇటీవల 211 కేంద్రాల్లో 50 రోజుల పండుగను జరుపుకుంది. మొదట్లో కాస్త మిశ్రమ స్పందనతో ప్రారంభమైన మహర్షి సినిమా టాక్, మెల్లగా పుంజుకుని ఆపై సూపర్ డూపర్ హిట్ రేంజికి చేరుకుంది. ఇక ఈ సినిమా కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు కూడా బద్దలు కొట్టడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అయ్యారు. 

ఇక ఈ సినిమా 50 రోజుల వేడుకను ఎంతో ఘనంగా హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో నిర్వహించాలని ఇటీవల చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. అయితే అదే సమయంలో శ్రీమతి విజయనిర్మల గారి అకాల మరణంతో ఆ వేడుక రద్దు కాబడింది. అయితే ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారని చెప్పాలి. ఇకపోతే ఆ తరువాత కొద్దిరోజులకే మహర్షి సినిమా ప్రముఖ వెబ్ మీడియా మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఇక ఇటీవల ప్రైమ్ లో ఫుల్ లెంగ్త్ డిజిటల్ లో అందుబాటులోకి వచ్చిన మహర్షిని ఇప్పటికే వేలాదిమంది వీక్షించారని అంటున్నారు. ఇకపోతే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ నటించే 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ రెండు రోజుల క్రితం కాశ్మీర్ లో ప్రారంభం అవ్వడం కూడా ఫ్యాన్స్ ని ఖుషి చేసే వార్తే అని చెప్పాలి. ఈ విధంగా మహేష్ ఫ్యాన్స్ ఒకందుకు నిరాశ చెందింగా, మరొక విధంగా సంతోషపడుతున్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: