పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నది. దాదాపుగా ఆ హోదాను దక్కించుకుంది కూడా.  ముకుందాతో టాలీవుడ్ కు వచ్చినా పెద్దగా ఉపయోగం లేదు.  డీజే తరువాతె ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది.  


డీజే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ లో మొహంజదారో చేసింది.  సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంటే ... ఆ సినిమా కాస్త ఫెయిల్ అయ్యింది.  ఇది ఆమెకు కలిసిరాలేదు.  ఎట్టకేలకు తిరిగి టాలీవుడ్ లో అరవింద సమేత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  అది సూపర్ హిట్ కొట్టింది. 


మరలా ఈ అమ్మడు బాలీవుడ్ హౌస్ ఫుల్ 4 చేసింది.  అరవింద సమేత  చేస్తూనే హౌస్ ఫుల్ 4 కంప్లీట్ చేసింది. ఆ తరువాత మహేష్ తో మహర్షి చేసి హిట్ కొట్టింది. దీంతో పూజా లక్కీ హీరోయిన్ గా మారింది.  ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నది.  ఈ సినిమా కోసం కొన్ని డేట్స్ ఇచ్చినా.. అటు బాలీవుడ్ లో సాజిద్ నడియావాలా మూడు సినిమాల కోసం ఏకంగా రెండు నెలల డేట్స్ ను ఇచ్చేసింది.  


ఈ డేట్స్ అన్ని వరసగా ఉండటంతో.. బన్నీ సినిమా కోసం ఆమె కేటాయించే సమయం తగ్గిపోయింది.  దీంతో ఆమె పాత్ర నిడివిని తగ్గించి మరో హీరోయిన్ ను తీసుకున్నారని సమాచారం.  టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఎదగాలని అనుకుంటూనే.. ఇలా బాలీవుడ్ కు ఎక్కువ సమయం కేటాయించడం ఏంటో... పూజాకే తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: