హైదరాబాద్ లో దొంగల బెడద ఎక్కువవుతోంది. చివరకు సెలబ్రెటీలకూ ఈ దొంగల బెడత తప్పడం లేదు. తాజాగా మల్లేశం హీరో ప్రియదర్శి బైక్ చోరీ అయ్యింది. ఇంటి ముందు పార్క్ చేసిన నా బుల్లెట్ ను దొంగలించుకుపోయారు. ఈ విషయం స్వయంగా ప్రియదర్శి ట్వీట్ ద్వారా వెల్లడించారు.


ప్రియదర్శి ఇటీవలే బుల్లెట్ బైక్ ఇష్టపడి కొనుక్కున్నాడు. సోమవారం ఇంటి ముందు పార్క్ చేశాడు. దాన్ని ఓ దొంగ దొంగిలించాడు. అయితే అక్కడ సీసీకెమేరాలు ఉండటం వల్ల అదంతా సీసీ కెమేరాలో రికార్డయ్యింది. ఆ దొంగ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోలేదని ప్రియదర్శి తెలిపాడు.


ఆ దొంగ అన్ ప్రొఫషనల్ దొంగ అంటూ ట్వీట్ లోనే సెటైర్లు వేశాడు. అయితే అసలు విషయం ఏంటంటే.. ప్రియదర్శి బైక్ ను సందీప్ కిషన్ టీమ్ తీసుకెళ్లిందట. నినువీడని నేను సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ బైక్ ను తీసుకెళ్లామని సందీప్ కిషన్ ట్విట్టర్లో స్పందించాడు.


''బైక్ తీసుకెళ్లడం ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. 'నిను వీడని నీడని నేనే' సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రియదర్శి బైక్ ని తీసుకెళ్లాం. ప్రియదర్శి డేట్స్ ఇవ్వనందుకు ఈ పని చేశాము. ఈ బైక్.. ప్రమోషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ అని, ప్రియదర్శి బైక్ నడపటం నాకు బాగా నచ్చింది అని, లవ్ యు దర్శి'' అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశాడు. అదీ అసలు సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: