ఇస్మార్ట్ శంకర్ మూవీ ఈనెల 18 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నట్టు సమాచారం.  రామ్ పోతినేనితో పాటు మరో నలుగురి భవితవ్యం ఈ మూవీపై ఆధారపడి ఉంది.. 


తప్పకుండా హిట్ కొట్టాలి ఈ సినిమా లేదంటే రామ్, దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మి,  మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.  అందులో ఎలాగైనా హిట్  కొట్టాలనే కసితో ఉన్నారు.  పరిస్థితులు మాత్రం దానికి తగ్గట్టుగా లేవన్నది వాస్తవం.  


ఎందుకంటే.. ట్రైలర్ కు మిక్స్డ్ టాక్ వచ్చింది.  అలానే, పాటలకు కూడా పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు.  సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తారని అనుకుంటే దిల్ రాజు హ్యాండ్ ఇచ్చాడు.  ఇక సినిమా విజయం కోసం ఓ అభిమాని తిరుమల కొండను మోకాళ్లపై ఎక్కారు.  


 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.  అభిమాని సాహసం కంటతడి పెట్టించించిందని ఛార్మి తెలిపింది.  దీనిపై రామ్ కూడా స్పందించాడు.  అభిమాని కోరిక మేరకు సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నట్టు రామ్ తెలిపాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: