నాగార్జున హీరోగా చేస్తున్న మన్మథుడు 2 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సాంగ్స్ షూట్ కూడా పూర్తి చేసుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పై దృష్టి పెట్టింది యూనిట్. ఈరోజు ఉదయం ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
టీజర్ పిచ్చెక్కించింది. రకుల్ ప్రీత్ సింగ్ లో మరో కోణాన్ని ఆవిష్కరించారు. ఈ టీజర్ తో సినిమా మరోస్థాయికి వెళ్లిందని చెప్పొచ్చు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో.. నాగ్ డబ్బింగ్ ప్రారంభించారు. డబ్బింగ్ స్టార్ట్ చేయడంతో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ మొదలయ్యాయి.
త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ట్రైలర్ ను బట్టి సినిమాను అంచనా వెయ్యొచ్చు. ఆగష్టు 9 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా సినిమా వస్తున్నది. ఆ మన్మధుడు కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కితే.. దీనిని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇందులో రకుల్ తో పాటు సమంత, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు. మనం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆనంది ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆ మన్మధుడు లానే ఈ మన్మదుడు కూడా హిట్టవుతుందా చూడాలి.