రామాయణం, మహాభారతం గ్రంధాలను సినిమాలుగా మలచాలి అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది.  భారీ ఖర్చుతో కూడుకొని ఉంటుంది.  అందుకే వీటి జోలికి వెళ్లేందుకు ఇప్పటి తరం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు.  సౌత్ లో కన్నడలో ఓ ప్రయోగం చేసేందుకు సిద్ధం అయ్యారు.   


సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలంటే ఇటీవల కాలంలో చెప్పుకునేవి బాహుబలి, కేజీఎఫ్ గురించే.  ఈ రెండింటికి మంచి పేరు వచ్చింది.  రాజమౌళి ఆలోచనల నుంచి బాహుబలి తెరకెక్కితే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ తెరెకెక్కింది.  ఈ రెండు సినిమాలో భారీ కలెక్షన్లు వసూలు చేశాయి.  కేజీఎఫ్ ఊహించని విధంగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  


కేజీఎఫ్ తరువాత కన్నడలో అలాంటి భారీస్థాయి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఇదే కోవలో పౌరాణిక గాథ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని దర్శన్ హీరోగా కురుక్షేత్ర సినిమా చేస్తున్నారు.  క్లుప్తంగా చెప్పాలి అంటే అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ చేసిన దానవీర శూర కర్ణ సినిమా లాంటిది.  కురుక్షేత్రలో దర్శన్ సుయోధనుడిగా కనిపిస్తున్నారు.  


దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ అంటే మెయిన్ కంటెంట్ గురించి.. సినిమాలో ఉన్న అద్భుతమైన విషయాల గురించి చూపించాలి.  అందులోను పౌరాణిక సినిమా కావడంతో దానిని ప్రమోట్ చేసుకోవడం చాలా అవసరం.  దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విషయంలో మ్యాటర్ ను తక్కువ చూపించి సినిమా బ్యానర్ గురించే సగం ట్రైలర్ సమయం ఖర్చు చేస్తే ఎలా చెప్పండి.  


ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఎదురు చూసిన నెటిజన్లు ఈ ట్రైలర్ ను చూసి కామెంట్స్ చేస్తున్నారు.   కామెంట్స్ చూసి షాకైన మ్యూజిక్ సంస్థ.. కామెంట్స్ ను డిజబుల్ చేసింది.  దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ట్రైలర్  పై నెటిజన్లు ఎంత కసితో ఉన్నారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: