'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి ఫుల్  ఎంటర్ టైనర్ తో మంచి  హిట్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు.  ఆ స్థాయి హిటూ  అందుకోలేదు.  అందుకే ఈ సారి  ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో  కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి  దర్శకత్వంలో  'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్' సినిమా చేస్తున్నాడట.  కాగా ఈ చిత్రంలో  సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం. 


ముఖ్యంగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా  హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల  నుండి తప్పించుకోవడానికి  హీరో చేసే పనులు.. ఆ పనులకు  మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి,  లాంటి  అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి  తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది.  ఇక  ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన  హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  మరి సందీప్ కిషన్ ఈ 'తెనాలి రామకృష్ణ'  మరో  'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' అవుతుందా.     


మరింత సమాచారం తెలుసుకోండి: