ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రగ్యా జైశ్వాల్, లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోలతో దర్శనమిస్తున్నారు. మొన్నటివరకు స్కిన్ షోకు నో చెప్పిన ఈ బ్యూటీలిద్దరూ, ఇప్పుడు ఫొటోషూట్స్ లో మాత్రం రెచ్చిపోతున్నారు. దీనికి ప్రత్యేకంగా కారణాలు వెదకాల్సిన పనిలేదని ఇట్టే అర్థమవుతోంది. సినిమా ఛాన్సులు తగ్గడంతోనే..ఇంకా చెప్పాలంటే లేకనే వీళ్లంతా ఇలా ఫొటోషూట్స్ కు సై అంటున్నారు. ఆ రకంగా కాసో కూస్తో డబ్బులు సంపాదించుకుంటున్నారు. 

కంచె సినిమాతో పాపులర్ అయిన ప్రగ్యా జైశ్వాల్ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా పెద్ద హీరోల కంట్లో పడలేకపోయింది. దీంతో వచ్చిన చిన్న చిన్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన క్రేజ్ ను పోగొట్టుకుంది. చివరగా ప్రగ్యా చేసిన ఆచారి అమెరికా యాత్ర, అంతకంటే ముందు చేసిన నక్షత్రం సినిమాలు డిజాస్టర్స్ అయిన విషయం తెలిసిందే. ఇటు లావణ్య త్రిపాఠి పరిస్థితి కూడా ఇలానే ఉంది. అందాల రాక్షసితో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ స్టార్ డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. గడిచిన రెండేళ్లలో ఆమెకు ఒక్కటంటే ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. 

దీంతో ఇండస్ట్రీ లావణ్యను మరిచిపోయింది. ప్రస్తుతం నిఖిల్ తో చేసిన అర్జున్ సురవరం మాత్రమే ఈమె చేతిలో ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇక రీసెంట్‌గా ఈ లిస్ట్ లో హెబ్బాపటేల్, షాలినీ పాండే కూడా చేరిపోయారు. 24 కిస్సెస్ తర్వాత హెబ్బా నుంచి మరో సినిమ రాలేదు. అటు 118 సినిమా సక్సెస్ అయినప్పటికీ, తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అయింది షాలినీ పాండే. 

వీళ్లిద్దరూ కూడా ఇప్పుడు ఎక్కువగా ఫొటో షూట్స్ తోనే కాలక్షేపం చేస్తున్నారని సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యో వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాదు వీళ్లతోపాటు ప్రణీత, ప్రియాంక జవాల్కర్ లాంటి కొంతమందికి ఇప్పుడు ఫొటో షూట్సే దిక్కయ్యాయి. కొన్నాళ్లుపోతే ఆ అవకాశాలు కూడా రావు వీళ్లకు. అప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి టాటా చెప్పేయాల్సిందే. మరి అందం అభినయంతో పాటు గ్లామర్ పాత్రలకి సై అంటున్న సరైన అవకాశాలు ఎందుకు రావటం లేదో వీళ్ళకి.


మరింత సమాచారం తెలుసుకోండి: