డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  స్వీయ దర్శకత్వంలో నిర్మించిన లేటెస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.  పూరి బ్యానర్ అయినా కూడా ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు మొత్తం పూర్తిగా ఛార్మి చూసుకుందట. సినిమాకు కావాల్సిన ప్రతి విషయాన్ని ఆమె స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 

ఆమె ఒక నిర్మాతగా కాకుండా ప్రొడక్షన్ టీం మాదిరిగా పని చేసిందని ఇప్పటికే అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బోనాల కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేశాం. చిత్ర యూనిట్ సభ్యులందరిని మెయింటెన్ చేయడం.. ప్రతి విషయాన్ని మేనేజ్ చేయడం ఏ రోజుకు ఆరోజు షూటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించడం వంటి పనులను ఛార్మి చాలా సమర్ధవంతంగా నిర్వర్తించింది. ఆమె వల్ల మాకు చాలా వర్క్ తక్కువ అయ్యింది. నా ప్రతి సినిమా కంటే ఈ సినిమాకు కాస్త ఎక్కువగా కష్టపడ్డానంటూ రామ్ చెప్పాడు.

ఇక దర్శకుడు పూరితో పాటు రామ్ కు కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. అంతేకాదు హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ లు స్టార్ డం దక్కించుకోవాలంటే ఈ చిత్రం సక్సెస్ అవ్వాల్సిందే. వీళ్ళతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వంటి చాలా మంది భవిష్యత్తు ఈ సినిమా సక్సస్ మీదే ఆధారపడి ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే జులై 18 వరకు వెయిట్ చేయాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: