సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించి గుర్తింపు దక్కించుకున్న పూజా హెగ్డే బాలీవుడ్ కు 'మొహంజుదారో' సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కోసం పాపం పూజా దాదాపు రెండేళ్ల పాటు సౌత్ లో ఒక్క సినిమాను ఒప్పుకోకుండా కష్టపడింది. కాని ఆ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సమయంలోనే పూజాకి టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న పూజా హెగ్డేకు మళ్లీ బాలీవుడ్ పై గాలి మల్లినట్లుగా ఉంది. 

ప్రస్తుతం తెలుగులో మూడు, నాలుగు సినిమాలు చేస్తున్న పూజా బాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతోంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించే ఈ సినిమాకు పూజా హెగ్డేను నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా లాక్ చేశాడట. ఆ సినిమా కోసం రెండు నెలలు కంటిన్యూగా ఈమె డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో పూజా తెలుగులో నటిస్తున్న సినిమాల డేట్ల విషయంలో గందరగోళం ఏర్పడుతుందని లేటెస్ట్ న్యూస్. 

అంతేకాదు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో అల్లు అర్జున్ సినిమాలో పూజా పాత్ర నిడివి తగ్గించే యోచనలో కూడా త్రివిక్రమ్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరో వైపు ప్రభాస్ తో కూడా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. సౌత్ లో ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఫ్లాప్ వచ్చిన బాలీవుడ్ కు వెళ్లడం అందరిని ఆశ్చర్య పర్చుతుంది. మరి ఈసారైనా ఈమెకు బాలీవుడ్ లో సక్సస్ వస్తుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: