పూజా హెగ్డే మళ్ళీ ఫాం లోకి వచ్చేసింది. ఆమె టాలీవుడ్లో హాట్ ఫావరేట్. టాప్ హీరోలందరికీ ఆమె మాత్రమే  కావాలిపుడు వరసగా మూవీస్ కూడా చేతిలో ఉన్నాయి. అయినా పూజాకు చూపు అక్కడే ఉందిట. అటు వైపే చూస్తోందట.అమ్మడు మళ్లీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుందన్న మాట


బాలీవుడ్‌ ‘బడా ప్రొడక్షన్‌ హౌస్‌ నడియాడ్‌వాలా గ్రాండ్‌ సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌’తో మూడు సినిమాల డీల్‌ కుదుర్చుకుంద‌ట న‌టి పూజాహెగ్డే. జుడ్వా, హౌస్‌ఫుల్, 2 స్టేట్స్, కిక్, భాఘీ చిత్రాలను నిర్మించిన సాజిద్‌ నడియాడ్‌వాలా ఈ మూడు చిత్రాలను భారీ లెవెల్లో నిర్మించనున్నారట. హౌస్‌ఫుల్‌ తర్వాత ఓ యాక్షన్‌ సినిమాను ఈ బ్యానర్‌లో పూజా హెగ్డే చేయబోతుంద‌ట . ఈ సినిమా కోసం రెండు నెలల భారీ డేట్స్‌ కూడా ఇచ్చింద‌ట‌. 


ఇందులో ఎన్నో స్టంట్స్‌ ఉండబోతున్నాయని, వాటిని పూజా స్వయంగా చేయబోతుంద‌ని స‌మాచారం. యాంజెలీనా జోలీ నటించిన హాలీవుడ్‌ ఫ్యాంటసీ థ్రిల్లర్‌ ‘టూంబ్‌ రైడర్‌’ తరహాలో ఈ చిత్రకథ సాగనుందట. త్రీ మూవీస్‌ డీల్‌లో భాగంగా చేసిన సినిమాలు సక్సెస్‌ అయితే పూజ బాలీవుడ్‌లోనూ టాప్‌ లిస్ట్‌లో నిలబడుతుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.


అయితే అమ్మడు మళ్లీ అందనంత ఎత్తుకు వెళ్ళిపోతుందన్న మాట. టాలీవుడ్లో టాప్ రేపే ఈ హీరోయిన్ హిందీ వైపు వెళ్తే ఇక్కడ ఆమెని రిప్లేస్ చేసే వాళ్ళెవరో. ఏది ఏమైనా పూజ అందానికి అభినయానికి బాలీవుడ్ కూడా సలాం కొడుతోంది. హాట్సాఫ్ కన్నడ బ్యూటీ.



మరింత సమాచారం తెలుసుకోండి: