అల్లు అర్జున్ ఏం చేసినా ప్రత్యేకత ఉండే విధంగా చూసుకుంటుంటాడు. ఇటీవలే దాదాపు 7 కోట్ల రూపాయలతో సొంతంగా క్యారీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ముంబైలో దానిని ఇంటీరియర్ డిజైన్ చేయించినట్టు తెలుస్తోంది. అన్నిరకాల సౌకర్యాలు అందులో అందుబాటులో ఉంటాయి.
ఫాల్కన్ క్యారీ వ్యాన్ ను కొనుగోలు చేసిన అల్లు అర్జున్ .. ముంబై లో పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. ఈ పార్టీకి తమన్నా, దేశముదురు బ్యూటీ హన్సిక హాజరయ్యారని తెలుస్తోంది. పార్టీని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన ఈ హీరో.. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాడు.
అలా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన బన్నీ, ఎయిర్ పోర్ట్ లో మీడియా కంటపడ్డాడు. ఇంకేముంది టకాటకా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యువహీరో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.