ప్రస్తుత పరిస్థుతులలో ఒక మంచి సినిమాను తీయడం ఎంత కష్టమో ఆసినిమాను ప్రమోట్ చేసి ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించుకోవడం ఒక పెను సమస్యగా మారింది. ఈవిషయంలోని వాస్తవాలను గ్రహించిన యంగ్ హీరో సందీప్ కిషన్ ఏకంగా తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్ కోసం ఒకరి ఇంటికి వెళ్లి అక్కడ పార్క్ చేసి ఉన్న బైక్ ను దొంగిలించిన విషయం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

వరస పరాజయాలతో సతమతమైపోతున్న సందీప్ కిషన్ ఈ నెలలో విడుదల కాబోతున్న తన లేటెస్ట్ మూవీ `నిను వీడ‌ని నీడ‌నునేనే` ప్రమోషన్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్నాడు. ఈ సినిమాకి నిర్మాత కూడా తానే అయిన నేపధ్యంలో ఈమూవీ ప్రమోషన్ ను చాల డిఫరెంట్ గా చేస్తున్నాడు. థియేట‌ర్ల‌లో షాపింగ్ మాల్స్‌లో టాయిలెట్ల‌లో కూడా `నిను వీడ‌ని నీడ‌ను నేనే` ప్ర‌మోష‌న్ల‌ను చేసుకుంటూ వెళుతూ ఉండటంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. 

ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా సందీప్ కిషన్ ఈమూవీ కోసం దొంగగా మారి ముసుగు వేసుకుని వెళ్ళి ఒకరి బైక్ ను దొంగిలించిన లేటెస్ట్ ప్రమోషన్ టెక్నిక్ ను చూసి చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఆ బైక్ హాస్యనటుడు ప్రియ‌ద‌ర్శిది. ఈ నటుడు ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో సందీప్ కిషన్ బైక్ దొంగిలించిన వీడియోను చిత్రీకరించి మీడియాకు విడుదల చేసి సందీప్ కిషన్ దొంగగా మారాడు అంటూ హడావిడి చేస్తున్నారు. 

మొదట్లో తన బైక్ పోయింది అని ప్రియ‌ద‌ర్శి ఖంగారు పడటం ఆతరువాత ఇది అంతా సినిమా ప్రమోషన్ కోసం అని తెలుసుకుని తెరిపిన పడటం చూసిన వారు అంతా నవ్వుకుంటున్నారు. ఈవిషయం పై ప్రియదర్శి సందీప్ కిషన్ కు సపోర్ట్ గా ఒక ట్విట్ కూడ చేసాడు. ‘నా బైక్‌కి నీ సినిమా ద్వారా బ్రేక్‌ ఇచ్చినందుకు థాంక్స్‌ అన్నా’ అంటూ ప్రియ‌ద‌ర్శి ట్విట్ చేసాడు. దీనితో సినిమాల ప్రమోషన్ ఇలా కూడ చేసుకోవచ్చా అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: