సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీర్ పరంగా ఇటీవల విడుదలైన 25వ సినిమా మహర్షి సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, పీవీపీ, అశ్వినిదత్ కలిసి సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ ని సంపాదించినప్పటికీ, మెల్లగా ప్రేక్షక అభిమానంతో సూపర్ డూపర్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు లో నటిస్తున్న మహేష్ బాబు, 

ఈ సినిమాతో మరోక్కసారి తనలోని పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చూపించనున్నాడు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన తొలిసారి బ్యూటీ రష్మిక మందన్న జోడి కడుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి ఎంతో భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ మూడు రోజుల క్రితం కాశ్మీర్ లో ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ స్పాట్ లో మహేష్ బాబును చూసిన హీరోయిన్ రష్మిక ఒక్కసారిగా అవాక్కయి షాక్ కు గురైనట్లు సమాచారం. దానికి కారణం ఏంటంటే, ఈ సినిమా ఓపెనింగ్ కి మహేష్ బాబు రాకపోవడంతో ఎప్పుడు ఆయనతో కలిసి సినిమాలో నటిస్తానా అని ఎదురుచూసిందట రష్మిక. 

ఇక అనుకున్నట్లుగా ఆ రోజు రానే వచ్చే సరికి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. అయితే షూటింగ్ ప్రారంభమయి సెట్లోకి హీరో మహేష్ ప్రవేశించాక, ఆయన లైట్ బాయ్ దగ్గరినుండి దర్శకుడి వరకు ప్రతి ఒక్కరితో ఒక సాదా సీదా వ్యక్తిలా ఎంతో కలిసిపోయి ఒదిగి ఉండడం చూసి షాక్ కు గురైందట. అంతపెద్ద సూపర్ స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ అలా ప్రతిఒక్కరితో అంతలా కలిసిమెలిసి మాట్లాడుతూ ఉండే మహేష్ బాబును చూస్తే ఎంతో ఆశ్చర్యం వేసిందని, అందుకే కాబోలు ఆయనకు సూపర్ స్టార్ అని పేరొచ్చిందని రష్మిక ఈ విషయాన్నీ తన సన్నిహితులకు చెప్పి సంతోషపడ్డదట. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది......!!


మరింత సమాచారం తెలుసుకోండి: