ఒకప్పుడు టాలీవుడ్ లో విలన్ గా వచ్చిన వారు తర్వాత హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ సత్తా చాటుతూ వస్తున్నారు.  ప్రస్తుతం ఈ ట్రెండ్ కాస్త మారింది..ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నవారు ఇప్పుడు విలన్ అవతారాలు ఎత్తుతున్నారు.  ఏది ఏమైనా సినిమాలో తమ కెరీర్ కొనసాగించాలంటే ఏ పాత్రకైనా న్యాయం చేయాలనేది వారి ఉద్దేశం. 

ఒకప్పుడు విలన్ గా తన సత్తా చాటి తర్వాత రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీహరి.  ఓ వైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ మంచి ఫామ్ లో ఉండగానే అనుకోకుండా గుండెపోటుతో మరణించారు.  టాలీవుడ్ లో స్టార్ డ్యాన్సర్ డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఈ దంపతులకు ఇద్దరు మగ సంతానం. అయితే  శ్రీహరి చనిపోయేనాటికి వీరు చిన్నపిల్లలు. అయితే శ్రీహరికి చిన్నోడిని హీరో చేయాలి.. పెద్దోడిని దర్శకుడిగా చూడాలి చిరకాల వాంఛ అని, కానీ ఆయన కోరిక తీరకుండానే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ‘రాజ్ దూత్ ’హీరో  మేఘాంశ్‌.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘రాజ్‌దూత్‌’ బైక్ లో ఉన్న వజ్రాల చుట్టూ అల్లుకున్న కథ ఇది.  ఆ బైక్‌ను వెతికి పట్టుకోవడం కోసమే నేను ప్రయత్నిస్తుంటాను. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో  సాగుతుంది.  ఈ సినిమాలో చాలా వరకు జర్నీలా కొనసాగుతుంది. ఓక్కో చోట ఒక్కో సంఘటన చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిత్రీకరణకు అమ్మ వచ్చినా కంగారు పడేవాణ్ని. తొలిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు కాస్త భయం అనిపించింది. క్రమంగా అలవాటు పడ్డా. కొత్తవాళ్లమైనా సినిమా కోసం బాగా  కష్టపడ్డాం. 

నటుడు తేజ వద్ద కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఆయన ‘బాహుబలి’లో వేగుగా నటించారు.అమ్మ - అన్నయ్య సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడూ ప్రోత్సహించారు. నేను బీబీఎమ్‌ చదివా. నటనపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది.. స్కూల్‌ రోజుల నుంచే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. అందుకే నటించే సమయంలో కాస్త ధైర్యం ఉండేది. నాన్న చనిపోయాక మేమంతా చిత్ర  పరిశ్రమకు దూరమయ్యాం.  నటనలో నాన్న, డ్యాన్స్‌లో అమ్మ నాకు స్ఫూర్తి. రియల్‌ స్టార్‌ అన్న పదం నాకంటే అన్నయ్యకే ఎక్కువ సరిపోతుంది. ప్రస్తుతం దర్శకత్వ శిక్షణలో ఉన్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: