తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ 1, 2 ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాయి.  ఈ తరహా కొత్త కార్యక్రమాలకు తెలుగు ప్రేజలు బ్రహ్మరథం పడతారని నిరూపించారు.  బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఈ నెలలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సీజన్ కి కింగ్ నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  అయితే ఇంటి సభ్యులు14 మంది  100 రోజులు బిగ్ బాస్ హౌజ్ లో గడపబోతున్నారట.

అయితే ఇంటి సభ్యులు ఎవరు అనేవిషయంపై ఇంకా క్లారిటీ రాకున్న రక రకాల కథనాలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా బిబ్ బాస్ 3 పై ప్రముఖ యాంకర్ సంచలన్ వ్యాఖ్యలు చేశారు.  యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూలతో కాస్త క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ శ్వేతారెడ్డిని ఈ షో కోసం సంప్రదించారట. ఆమె ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  యాంకర్ శ్వేతారెడ్డిని బిగ్ బాస్ షో కోసం సంప్రదించి తర్వాత అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగిపోయిందట.

బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ చేయడం మీకు ఇంటరెస్ట్ ఉందా..? అంటూ తనకు ఓ కోఆర్డినేటర్ నుండి ఫోన్ వచ్చిందని.. తాను ఓకే చెప్పిన తర్వాత మరో కోఆర్డినేటర్ గేమ్ వివరాలను చెబుతానని పిలిచి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని ప్రశ్నించారని. బిగ్ బాస్ 3 లో పాల్గొంటారా అని వారే తనను సంప్రదించి ఇలాంటి ప్రశ్నలు వేయడం ఏంటా అని ఆశ్చర్యపోయానని..తర్వాత తెలిసింది వారు తనను మోసం చేశారని.. వాపోయింది.

అయితే కో ఆర్డినేటర్ అడిగిన ప్రశ్నలకు అర్థమేంటని? గేమ్ మొదలుకాకముందే ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగితే సదరు వ్యక్తి.. ''మీరు మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారని'' అని అడిగాడని.. 'కమిట్మెంట్ అడుగుతున్నారా..?' నాలుగు చివాట్లు పెట్టానని అన్నారు.  అప్పుడు అర్థమైందని తనను అవాయిడ్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  మరి దీనిపై షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: