తెలుగులో మరే రియాలిటీ షోకు లేని క్రేజ్ బిగ్ బాస్ షోకు ఉంది. స్టార్ హీరోలు ఈ షోను హోస్ట్ చేస్తుండటం మనకు బాగా పరిచయం అయిన సెలబ్రిటీలు ఈ షోలో బయటి ప్రపంచానికి దూరంగా గడపటం ఈ షోపై ఆసక్తి కలిగేలా చేసాయి. కానీ బిగ్ బాస్ సీజన్ 3 ఇంకా మొదలుకాకముందే ఈ షోను విమర్శలు చుట్టుముడుతున్నాయి. యుట్యూబ్ యాంకర్ శ్వేతా రెడ్డి ఈ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. 
 
బిగ్ బాస్ షో నుండి తనకు కాల్ వచ్చిందని, కో ఆర్డినేటర్ ఒకరు ఈ షోలో మిమ్మల్ని ఎంపిక చేస్తే మాకేం లాభమని అడిగారని చెప్పుకుంది. కానీ ఫోన్ చేసింది నిజంగా బిగ్ బాస్ నిర్వహకులో కాదో ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో కూడా నూతన్ నాయుడు అనే కంటెస్టెంట్ ను డబ్బులు తీసుకుని బిగ్ బాస్ షోకు పంపించారనే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలపై కూడా బిగ్ బాస్ టీమ్ అప్పుడు స్పందించలేదు. 
 
నిజానికి ఇలాంటి విషయాలపై బిగ్ బాస్ నిర్వాహకులు వెంటనే స్పందించాలి. ఇలాంటి విషయాలపై క్లారీటీ ఇవ్వకపోతే ప్రజలు ఇలాంటి విషయాలు నిజమని నమ్మే అవకాశం ఉంది. జులై 21నుండి ప్రారంభం కాబోతున్న ఈ షోలో శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, హెబ్బా పటేల్, వరుణ్ సందేశ్, సీరియల్ హీరో జాకీ ఎంపికయినట్లు తెలుస్తుంది. స్టార్ హీరో నాగార్జున సీజన్ 3 కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: