సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం `సరిలేరు నీకెవ్వరు`, మహర్షి అంతటి బ్లాక్బస్టర్ తరవాత వస్తున్న సినిమా కావడం తో అంచనాలు ఆకాశాన్ని అంటాయి, దానికి తోడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అలానే ఉంది, అయితే, అనిల్ రావిపూడి మాత్రం ఎం టెన్షన్ లేకుండా తానూ నమ్మిన కాదహనే తీస్తున్నాడు. దీంట్లో భాగంగా, ఇప్పుడు ఇండియా లో మిలిటరీ మీద వచ్చిన సినెమళ్లని హిట్ అవ్వడం తో, మహేష్ చేత మిలిటరీ ఆఫీసర్ రోల్ వేయించాడు అనిల్. 


కశ్మీర్ షెడ్యూల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ట్రైన్ సెట్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది, ఈ ట్రైన్ స్కీన్ల 'వెంకీ' సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ కన్నా కామెడీ ఉండేలా అనిల్ రాసాడని టాక్. కశ్మీర్ నుంచి ఆంధ్రా వెళ్లే రైల్లో ఆర్మీ అధికారి మహేష్ కి .. ఇతర ప్రధాన తారాగణానికి .. మధ్య సాగే ఆసక్తికర సీక్వెన్సును తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ - విజయశాంతి మధ్య సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే విజయశాంతి ఇంటి సెట్ ని నిర్మిస్తున్నారు.


లేటెస్ట్ గా మహేష్ మిలటరీ గెటప్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ నుంచి మహేష్ గెటప్ రివీలైన నిమిషాల్లోనే ఫ్యాన్స్ లో వైరల్ గా దూసుకెళ్లింది. తాజాగా ఈ పాత్ర పేరు కూడా రివీలైంది. మహేష్ పాత్ర పేరు మేజర్ అజయ్ కృష్ణ. ఆర్మీ అధికారి పాకెట్ పై ఉండే బ్యాడ్జ్ పై అజయ్ కృష్ణ అన్న పేరు ఉంది. 


ఇక ఈ పేరును సెలెక్ట్ చేసుకోవడానికి ఓ ఆసక్తికర కారణం రివీలైంది. దూకుడు లో అజయ్.. పోకిరిలో కృష్ణ మనోహర్ .. రెండూ కలిపి అజయ్ కృష్ణ అని పేరు పెట్టారు. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం? అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతూనే ఓ చక్కని సందేశాన్ని ఇస్తున్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: