మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఓ పక్క హీరోగా ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తుండగా నిర్మాతగా కూడా సైరా సినిమా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా నరసింహా రెడ్డి తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రమోషన్స్ కు మొదలు పెట్టనున్నారు. 


నిర్మాతగా చరణ్ సైరా ప్రమోషన్స్ లో పాల్గొనడం కష్టమే అని తెలుస్తుంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ సినిమా బిజీ షెడ్యూళ్లతో ఉన్న చరణ్ సైరా ప్రమోషన్స్ కోసం మెగా ప్లాన్ చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. సైరా ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేశాడట. సైరా ప్రమోషన్స్ కోసం ఓ స్పెషల్ టీం సిద్ధం చేశాడట.    


సోషల్ మీడియాలో సైరా ప్రమోషన్స్ కోసం చరణ్ ఏర్పాటు చేసిన ఈ టీం కోసం చరణ్ కొంత బడ్జెట్ కేటాయించాడని తెలుస్తుంది. ఇకమీదట మెగా ప్రమోషన్స్ అన్ని ఆ టీం చేతుల్లోనే ఉంటుందట. సైరాతో పాటుగా మిగతా మెగా హీరో సినిమాలన్ని కూడా ఈ స్పెషల్ టీంతోనే ప్రమోషన్స్ ఏర్పాటు చేస్తారట.  


ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 250 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: