నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులిపే కలెక్షన్లతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో సమంత అద్భుతంగా నటించిందని అనేకమంది నుండి ప్రశంసలు అందుకుంది.


ఇదే సినిమా వేసవిలో రిలీజ్ అయ్యి ఉంటే మహర్షి తర్వాత ఎక్కువ లాభాలు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించే దని...కొంచెం నిర్మాతలు టైమింగ్ మార్చాల్సి ఉంటే బాగుండేదని సినిమా అత్యద్భుతం అని కుటుంబపరంగా ఈ రోజుల్లో ఇటువంటి సినిమా చూడాలని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇలా ఉండగా సమంత మరొకసారి నందిని రెడ్డి తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినబడుతున్నాయి.


వీరిద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోంద‌ని టాక్‌. గతంలో జబర్దస్త్ వచ్చింది ఆ తర్వాత `ఓ బేబీ` రావటం జరిగింది ఈ సినిమా జ‌రుగుతున్న‌ప్పుడే స‌మంత‌కు ఓ క‌థ వినిపించింది నందిని. `ఓ బేబీ` హిట్ట‌యితే త‌ప్ప‌కుండా మ‌రోసారి క‌లిసి ప‌నిచేద్దాం అని స‌మంత కూడా మాటిచ్చిన‌ట్టు స‌మాచారం. ఇదో థ్రిల్ల‌ర్ చిత్ర‌మ‌ని, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోనే చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో చాలా మంది నెటిజన్లు ఈ కాంబినేషన్ సూపరో సూపర్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: