సౌత్ లో ప్రేక్షకులను దశాబ్ద కాలంకు పైగా ఎంటర్ టైన్ చేస్తున్న స్వీటి.. అనుష్క. బాహుబలి సినిమాతో అనుష్క క్రేజ్ బాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. బాహుబలి 2 సినిమా విడుదలైన తర్వాత ఈమెకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు  వచ్చాయి. అయితే సైజ్ జీరో కోసం బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకునే క్రమంలో ఏ సినిమాలు ఒప్పుకోకుండా కాస్త గ్యాప్ తీసుకుంది. అందుకే భాగమతి సినిమా తర్వాత అనుష్క మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రీసెంట్‌గా అనుష్క 'సైలెన్స్' అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇండ్స్ట్రీలో అనుష్కకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు కొన్ని ముఖ్య సీన్స్ ను హిందీ, తమిళంలో ప్రత్యేకంగా  చిత్రీకరిస్తున్నారట. ఇక మూడు వర్షన్ లకు కూడా కొన్ని పాత్రలకు సంబంధించిన నటీనటులు కూడా మారుతున్నట్లు లేటెస్ట్ న్యూస్. తెలుగులో 'నిశబ్దం'గా రిలీజ్ కాబోతుండగా తమిళం, హిందీలో సైలెన్స్ టైటిల్ తో విడుదల కాబోతుంది. 

బాహుబలి తో వచ్చిన క్రేజ్ కారణంగా 'సైలెన్స్' సినిమాకి బాలీవుడ్ లో మంచి బిజినెస్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ లో పెద్ద స్టార్ అయ్యాడు. ఆ సినిమా టెక్నీషియన్స్ అండ్ ఇతర నటీనటులు అంతా కూడా బాలీవుడ్ లో నోటెడ్ అయ్యారు. బాహుబలి స్టార్ గా 'సైలెన్స్' సినిమాని అక్కడ ప్రమోట్ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందనే నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ సగం పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను త్వరలో రివీల్ చేయనున్నట్లు ఫ్రెష్ అప్‌డేట్.  



మరింత సమాచారం తెలుసుకోండి: