గాయత్రి గుప్తా బోల్డ్ స్టేట్మెంట్స్ తో నిత్యం ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇది సంచలన నటి శ్రీరెడ్డితోనే మొదలైందని అంతా అనుకుంటారు. కానీ, ఆమె కంటే ముందే ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది గాయత్రి గుప్తానే. తనను అవకాశాలు ఇస్తానని చాలా మంది మోసం చేశారని, అలాగే కొంతమంది ఛాన్స్ కావాలంటే ఏం చేస్తావని ప్రశ్నించారని చెప్పి బాంబు పేల్చింది. 


గత సంవత్సరం జరిగిన ‘బిగ్ బాస్' సీజన్ -2లో ఈమెకు అవకాశం దక్కింది అని అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటికే కాస్టింగ్ కౌస్ వివాదంతో పాపులర్ అయిన ఈమెను స్టార్ మా యాజమాన్యం ‘బిగ్ బాస్'లోకి తీసుకోవడానికి ప్రయత్నించింది. కాకపోతే ఎందుకో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని వార్తలు వచ్చాయి. బిగ్ బాస్' ఆఫర్ గురించి తాజాగా ఓ న్యూస్ చానెల్ డిబెట్‌లో మాట్లాడింది గాయత్రి గుప్తా.


‘‘నాకు లాస్ట్ ఇయర్‌లో జరిగిన ‘బిగ్ బాస్' సీజన్ -2లో ఆఫర్ వచ్చిన విషయం నిజమే. అందుకోసం నేను స్టార్ మా వాళ్లతో మాట్లాడడానికి కూడా వెళ్లాను. అప్పుడు నన్ను ‘బిగ్ బాస్' షో వాళ్లు ‘హౌస్‌లోకి వస్తే వంద రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా..? నీ సెక్స్ జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటావు..?' అని ప్రశ్నించారు'' అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్' ఆఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత హౌస్‌లోకి వెళ్లిన నా ఫ్రెండ్స్‌ను హౌస్‌లో ఎలా ఉంటుంది..? లోపల ఏం జరుగుతుంది..? అని అడిగాను. వాళ్లంతా.. క్యాన్సిల్ అయిందే మంచిదైంది అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: