మెగా స్టార్ చిరంజీవి త‌మ్ముడుగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలి సినిమా `అక్క‌డ‌ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి`. ఈ సినిమాకు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా అక్కినేని నాగేశ్వరరావు మనమరాలు సుప్రియా న‌టించింది. సినీ ఇండ‌స్ట్రీలోకి ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన‌ సుప్రియ‌కు కూడా ఇదే తొలి సినిమా. సినిమా రంగానికి చెందిన రెండు పెద్ద కుటుంబాలకు చెందిన నట వారసులు ఒకేసారి.. ఒకేసినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టి పడేలా చేసింది.


ఇక ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడిండ‌నే చెప్పాలి. ఆ త‌ర్వా వీరిద్ద‌రూ మ‌రో సినిమా తీసింది లేదు. అక్క‌డ నుంచి సుప్రియ పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. ఆమెకు త‌మ వైవాహిక జీవితం కూడా స‌క్ర‌మంగా లేని ప‌రిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇటు చూస్తే ప‌వన్ ఎంతో క‌ష్ట‌ప‌డి విజ‌యాల‌ను తాను స్టార్ స్టేట‌స్ సొంతం చేసుకున్నాడు. ప్ర‌జ‌ల్లో త‌న‌కంటూ ఒక హైప్ క్రియేట్ చేసుకొని స్థార్ హీరోగా ఎదిగాడు. అలాగే ఇప్ప‌డు ఆయ‌న సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి జ‌న‌సేన పార్టీ స్థాపించారు.


ఇప్పుడా సుప్రియ టాలీవుడ్‌డో రీ ఎంట్రీ ఇచ్చి గూఢాచారి సినిమాతో  ప‌రిచ‌డం అవ్వ‌డం తెలిసిందే. అయితే ఆమె ప‌వన్ క‌ళ్యాణ్ గురించి ఎప్పుడు మాట్టాడ‌లేదు. తాజాగా చాలా రోజుల త‌ర్వా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాము ఇద్ద‌రం క‌లిసి న‌టించిన అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాలో ప‌వ‌న్ బాగా క‌ష్ట‌ప‌డ్డారు. ఆ సినిమాలో ఆయ‌న నిజంగానే చేతుల‌పై కార్లు పోయేలా చేయ‌డంతో పాటు.... ఛాతిపై రాళ్లు కొట్టించుకుని చాలా శ్ర‌మించారు. ఆయ‌న చేసిన ప‌నుల‌కు షూటింగ్‌లో క‌న్నీరు ఆగ‌లేదు. నిజంగానే ఆయ‌న ఆ తర్వాత కూడా చాలానే క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చారు అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆకాశానికి ఎత్తేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: