వర్మ ఫ్యాక్టరీ నుండి వచ్చిన డైరక్టర్ పూరి జగన్నాథ్. మొదటి సినిమా బద్రితోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత బాచి తీశాడు. ఇక ఆ తర్వాత రవితేజతో చేసిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.


రవితేజకి స్టార్ డం తీసుకొచ్చిన పూరి ఆ తర్వాత స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. నాగార్జునతో శివమణి తీసిన పూరి సూపర్ స్టార్ మహేష్ తో పోకిరి సినిమా చేశాడు. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను సైతం పోకిరి పటాపంచలు చేసింది. మహేష్, పూరి కాంబోలో పోకిరి సెన్సేషన్ కాగా ఆ తర్వాత బిజినెస్ మెన్ సినిమా కూడా హిట్ అయ్యింది.


తెలుగు దర్శకుల్లో పూరి ప్రత్యేకత వేరే అని చెప్పొచ్చు. చేసేది స్టార్ హీరోనే అయినా ముందు సినిమాల ఇమేజ్ కు పూర్తిగా భిన్నంగా తన సినిమాలో వారి పాత్రలను రాస్తాడు. పూరి చేతిలో పడితే హీరోల ఫేట్ మారాల్సిందే అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు. మహేష్ పోకిరి, ప్రభాస్ బుజ్జిగాడు ఇలా హీరోలకు ఓ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్యారక్టరైజేషన్ అలవాటు చేశాడు.  


ఇక ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు పూరి. టెంపర్ తర్వాత 6 సినిమాలు చేసిన పూరి ఒక్కటి హిట్ కొట్టలేదు. అన్ని ఆశలు ఇస్మార్ట్ శంకర్ మీద పెట్టుకోగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పూరి కసితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మరోసారి తన సత్తా చాటేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: