బాహుబలి వంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ లో దాదాపు మూడు వందల కోట్ల తో తెరకెక్కిన 'సాహో' సినిమా ఆగష్టు నెల చివరన విడుదల కాబోతోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త నిర్మాతలు బయటకు చెప్పారు.


అదేమిటంటే ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమా అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు యావత్ భారత దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాలో 100 మందితో రామ్ చరణ్ చేసిన ఫైట్ సినిమాకే హైలెట్. ఇప్పుడు అదే తరహాలో 'సాహో' సినిమా లో కూడా ఒక ఫైట్ ఉన్నట్లు సమాచారం.


ఇందుకోసమే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు చేసినట్లు ఈ ఫైట్ సీన్ లో ప్రభాస్ తో పాటు 100 మంది హాలీవుడ్ ఫైటర్స్ తో ప్రభాస్ పోరాటం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ పెంగ్ జాంగ్ ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. దీంతో ఈ వార్త బయటకు రావడంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాహో సినిమా పెద్ద హాట్ టాపిక్ అయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: