తెలుగులో హీరో వెంకటేష్ సరసన 'మల్లీశ్వరి' సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది కత్రినా కైఫ్ . అయితే ఆ తర్వాత బాలయ్యతో 'అల్లరి పిడుగు'లో నటించి ఆ తర్వాత తన మకాం బాలీవుడ్‌కు ఫిఫ్ట్ చేసింది. అక్కడ మాత్రం తన అంద చందాలతో అదరగొడుతూనే ఉంది. ఇప్పటికీ కూడా యువ హీరోయిన్స్‌కు ధీటుగా దూసుకుపోతోంది అక్కడ.రీసెంట్‌గా ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ‘భారత్’ సినిమాలో నటించింది. 


చాలా కాలం తర్వాత కత్రినా.. సల్మాన్ సరసన నటించడంతో మరోసారి ఈ భామ వార్తల్లో నిలచింది. ఐతే  గతంలో సల్మాన్, కత్రినా మధ్య ప్రేమ బంధం ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ భామ రణ్‌భీర్ కపూర్‌తో కొన్నేళ్లపాటు డేటింగ్ చేసింది. అయితే 2016లో వారీ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. రీసెంట్‌గా ఇటీవల ఒక మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాజీ ప్రేమికులతో తనకున్న అనుబంధం గురించి కత్రినా తన అభిప్రాయాలను వెల్లడించారు. 


మాజీ ప్రేమికులు ఎదురవగానే అలిగి వెళ్లిపోవడం, బాధపడటం వంటివి చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులు.. వారితో ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు. నాకు జీవితంలో రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు నేను సింపుల్‌ ఆప్షన్‌నే ఎంచుకుంటాను అంటోంది బాలీవుడ్ భామ కత్రినా కైఫ్.
నాకు నా మాజీ లవర్స్‌ ఎదురైతే  నేను అస్సలు బాధపడను. వారితో గడిపిన క్షణాలను గురించి  ఆలోచించను. ఆ అవసరం ఏముంది? అలాంటి అనుభవాలన్నీ మనకు ఎన్నో నేర్పుతాయి. అందరికీ ప్రేమ ఫలించకపోవచ్చు అందుకని వారితో ఎప్పటికి ఫ్రెండ్లీగా ఉండటానికే ప్రాధాన్యత నిస్తానని తెలిపింది కత్రినా కైఫ్. 


ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని ఓ కార్యక్రమంలో పంచుకున్నారు. ఇద్దరు ప్రేమికులు విడిపోయి మళ్లీ కలిసినప్పుడు వారు ఫ్రెండ్లీగా ఉండొచ్చు. కానీ వారు స్నేహితుల్లా ఉండగలరా? లేదా? అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: