కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ అంతటా స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై అన్ని భాషల్లో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది ఆ సినిమా. యువ హీరో యశ్ కూడా కె.జి.ఎఫ్ తో కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం కె.జి.ఎఫ్ డైరక్టర్ ఆ సినిమా చాప్టర్ 2 తీస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.


2020లో కె.జి.ఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే మైత్రి నిర్మాతలకు ప్రశాంత్ నీల్ ఓ కథ చెప్పాడట. ఎన్.టి.ఆర్ తో కె.జి.ఎఫ్ లాంటి సినిమా చేస్తాడని అనుకుంటే డ్యాన్స్ నేపథ్యంతో కథ సిద్ధం చేస్తున్నాడట.


కె.జి.ఎఫ్ లాంటి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డిఫరెంట్ కథతో వస్తున్నాడు. తప్పకుండా తారక్ తో చేసే ఈ సినిమా కూడా అంచనాలకు తగినట్టుగా ఉంటుందని చెప్పొచ్చు. మైత్రి మూవీస్ ప్లాన్ ప్రకారం ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం తారక్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో ఉన్నాడు. అది పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: