గత వారం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్, పూరీ జగన్నాథ్ ఇద్దరికీ సక్సెస్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి మాట్లాడుతూ నా కెరీర్లో మొదటిసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసానని అన్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ చేసినందుకు అందరూ చాలా పొగుడుతున్నారని పూరీ అన్నారు. 
 
పూరీ మాట్లాడుతూ ప్రజలు ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఆదరించడం వలనే ఈ సినిమా ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా చూసి అభినందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙతలు. రానా, అఖిల్ ఇలా హీరోలందరూ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. బాలకృష్ణ గారు సినిమా ఈ రోజే చూస్తున్నారు. బాలకృష్ణ గారికి నా యొక్క ధన్యవాదములు . ఇకముందు కూడా మాస్ సినిమాలే తీస్తాను. తీసిన సినిమాలన్నీ హిట్ అయ్యేలా చేస్తాను. 
 
అతి త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమా స్టార్ట్ చేయబోతున్నాను అని పూరీ జగన్నాథ్ అన్నారు. 9 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా 63 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 31 కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది. డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కావటంతో కొంతమేర కలెక్షన్లు తగ్గినా డియర్ కామ్రేడ్ సినిమాకు యావరేజ్ టాక్ రావటంతో ఇస్మార్ట్ శంకర్ సినిమా మరో వారం దాకా కలెక్షన్లు బాగానే సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవ్వటంతో ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరికీ కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది. నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి మాట్లాడుతూ క్రూషియల్ టైమ్లో ఈ హిట్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవడం నా కెరీర్ కి ఎంతో హెల్ప్ అవుతుంది అన్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: