బిగ్ బాస్ 3.. చప్పగా మొదలైన ఈ గేమ్ షో.. ఇప్పుడు కాంట్రావర్సీలతో రక్తి కడుతోంది. మొట్టమొదటగా ఎలిమినేట్ అయిన హేమ.. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అనేక కాంట్రావర్సీలను బయటపెట్టింది. ఆమె ఇతర కంటెస్టెంట్లపై చేసిన ఆరోపణల సంగతి అటుంచితే.. ఆమె ఓ షాకింగ్ న్యూస్ బయపెట్టింది.
బిగ్ బాస్ షోలోకి వెళ్లిన ఆడవాళ్లకు.. ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకోమన్నారట. హేమ ఏంచెప్పిందంటే... ‘బిగ్ బాస్’ సెలక్షన్స్ టైమ్లో నన్ను ప్రెగ్నెసీ టెస్ట్ చేయించుకోమన్నారు. నేను చేయించుకుని రిపోర్ట్స్ ఇచ్చాను. అందులో తప్పేముంది? నాకు పెళ్లైంది. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే ఇతర సభ్యులకు తెలియదు కదా! గేమ్లో భాగంగా నేను కిందపడి అబార్షన్ అయితే ‘బిగ్ బాస్’ వాళ్లనే అంటారు కదా అని ఆ నిబంధనను సమర్థించింది.
బిగ్బాస్ సీజన్ 3లో న్యూస్ యాంకర్ తీన్మార్ సావిత్రి, జర్నలిస్టు జాఫర్, యాంకర్ శ్రీముఖి, నటీమణులు హేమ, హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్ సందేశ్, అతడి భార్య వితికా షేరు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, భరణి, దుర్గ, అషూరెడ్డి(డబ్స్మాష్ స్టార్), రఘు మాస్టర్, ఫన్ బకెట్ మహేష్ విట్టా, తమన్నా సింహాద్రిలు పాల్గొంటున్నారు.
వీరిలో తీన్మార్ సావిత్రి, యాంకర్ శ్రీముఖి, నటి హిమజ, ఉయ్యాల జంపాల ఫేం పునర్ణవి భూపాలం, వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు, దుర్గ.. ఇలా వీరందరికీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించిన తర్వాతే బిగ్ బాస్ షోలోకి అనుమతించి ఉంటారని తెలుస్తోంది.
హేమ చెప్పినట్టు ఈ నిబంధనలను కూడా తప్పుబట్టటానికి లేదు.. దాదాపు నెలల తరబడి బిగ్ బాస్ లో ఉంటున్నప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఎలాంటి వివాదాలకు, లీగల్ సమస్యలకు అవకాశం లేకుండా చేసేందుకే ఈ పరీక్షలు చేయించి ఉంటారు బిగ్ బాస్ టీమ్.