'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. ఆ సినిమా నభాకు అంతగా పేరు తెచ్చింది లేదు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా తర్వాత నభా పేరు గట్టిగా ఎక్కడా వినిపించింది లేదు. కానీ ఇస్మార్ట్ శంకర్ తో నభా ఎవరో అందరికీ తెలిసిపోయింది. అంతేకాదు తన గ్లామర్ తో బాగా పాపులర్ అయిపోయింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, నభా నటాష్, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్స్‌గా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. హైదరాబాదీ తెలంగాణా యాసతో ఎనర్జిటిక్ రామ్ సినిమాను రక్తికట్టించగా.. అందచందాలతో ఇద్దరు హాట్ హీరోయిన్స్ సినీ ప్రియులను కైపెక్కించారు. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. చాలా రోజుల తర్వాత పూరీ, రామ్ కెరీర్‌లో ఓ మంచి హిట్ సినిమా పడడంతో ఇద్దరు ఆనందంలో మునిగితేలుతున్నారు.

అయితే ఇదివరకే 'నన్ను దోచుకుందువటే' సినిమా చేసినప్పటికీ నాభాకు ఇంత పేరు రాలేదు. కానీ ఇస్మార్ట్ శంకర్‌ తో మాత్రం నభా రేంజ్‌‌ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు రేంజ్ పెరిగితే రేటు పెంచేస్తారు కదా.. తనకు డిమాండ్ పెరగడంతో రెమ్యునరేషన్ సైతం బాగా పెంచేసింది. కొత్త సినిమాలకు రూ. 25 నుంచి రూ. 40 లక్షల వరకు డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది.

అంతేకాదు రీసెంట్‌గా ఒకరిద్దరు నిర్మాతలు ఈ హాట్ బ్యూటీని సంప్రదించగా రూ. 40 లక్షలకు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిందట. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఉన్న కొద్దిసేపటికే నేను మంచి రెమ్యునిరేషన్ తీసుకున్నానని.. ఇక హీరోయిన్‌గా అయితే రేటు పెంచకుండా ఎందుకుంటానని నిర్మాతలకు చెప్పి పంపిందట. మొత్తానికి చూస్తే 'ఇస్మార్ట్ శంకర్' నభాకు మాత్రం బాగానే కలిసొచ్చిందన్న మాట. అయితే ఈ రేంజ్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీసుకుంటారో లేకుంటే ఇంటికే పరిమితం చేస్తారో వేచి చూడాల్సిందే మరి. ఇక మరో హీరోయిన్ నిధీ పూరీ ఛార్మి తో కలిసి ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తోంది. బహుషా పూరి నెక్స్ట్ సినిమాలో కూడా నిధీనే ఎంచుకున్నారేమో మరి. 



మరింత సమాచారం తెలుసుకోండి: