తెలుగులో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా దగ్గుబాటి. బాహుబలి లోని భల్లాల దేవ పాత్ర ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రానా అటు హిందీలో, ఇటు తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. హిందీలో హాథీ మేరె సాథీ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. తెలుగులో " నీది నాది ఒకే కథ" దర్శకుడు వేణు ఊడుగుల తో విరాట పర్వం అనే సినిమా చేస్తున్నాడు.


ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని షూటింగ్ జరుపుకుంటుంది. సాయి పల్లవిని హీరోయిన్ గా నటిస్తుంది. అయితే షూటింగ్ మొదలెట్టే టైంకి  రాణా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ కోసం విదేశాలకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఈ చిత్రానికి సాయి పల్లవి ఇచ్చిన డేట్స్‌ వేస్ట్‌ అవుతున్నాయి. శేఖర్‌ కమ్ములతో నాగచైతన్యకి జంటగా ఒక చిత్రం చేయడానికి అంగీకరించిన సాయి పల్లవి సెప్టెంబర్‌ నుంచి ఆ చిత్రం షూటింగ్‌లో బిజీ అవుతుంది. 


అందుకే ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్‌ వాడుకోవాలని, లేదంటే ఇప్పట్లో డేట్లు ఇవ్వలేనని దర్శక, నిర్మాతలకి తేల్చి చెప్పింది. దీంతో సాయి పల్లవిపై సోలో సీన్లు మొత్తం ఇప్పుడు తీసేస్తున్నారు. ఒకవేళ షూటింగే చేయకపోతే ఈ చిత్రం నుంచి వైదొలుగుతానని సాయి పల్లవి అంటుందనే భయంతో హీరో కాంబినేషన్‌లో లేని సీన్లు మొత్తం లాగించేస్తున్నారు.


 రానా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా సాయి పల్లవి వెంటనే షూటింగ్‌కి రాదట. శేఖర్‌ కమ్ముల చిత్రానికి గ్యాప్‌ వచ్చినపుడే ఈ చిత్రానికి మళ్లీ డేట్స్‌ ఇస్తుందట. అయినా కానీ ఈ పాత్రకి సాయి పల్లవి వుండి తీరాలని ఆమెని మిస్‌ కానివ్వకుండా కాపాడుకుంటున్నారట. అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: