పూరీ రామ్ లకు జోష్ ను ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సంబంధించిన పోస్టర్ల పై ఇప్పుడు వివాదం రాజుకోవడంతో ఆ సమస్యలకు సమాధానాలు ఇచ్చుకోవలసిన పరిస్థితిలో పూరీ రామ్ లు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు జాయింట్ డైరెక్టర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ ఫెయిర్ డిపార్ట్ మెంట్ టొబాకో ప్రొడక్ట్స్ చట్టానికి విరుద్ధంగా ఈమూవీ పబ్లిసిటీ పోస్టర్స్ ఉన్నాయని అందువల్ల వాటి పై వివరణ ఇవ్వవలసిందిగా పూరీకి అదేవిధంగా రామ్ కు నోటీసులు ఇచ్చినట్లు టాక్. 

రామ్ సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న పోస్టర్లు అనేక మల్టీ ఫ్లెక్స్ ధియేటర్లలో కనిపించిన పరిస్థితులలో సిగరెట్ కాల్చడం హానికరం అన్న అక్షరాలు  లేకుండా పోష్టర్లు వేయడం సెక్షన్ 5 టొబాకో యాక్ట్ కు ఉల్లంఘన అని చెపుతూ ఈ నోటీసులు సర్వ్ చేసినట్లు తెలుస్తోంది. దీనితో షాక్ అయిన పూరీ ఇది చిన్న విషయమే అయినప్పటికీ ప్రభుత్వ డిపార్ట్ మెంట్ వ్యవహారం కాబట్టి దానికి సరైన సమాధానం ఇవ్వడానికి తన సన్నిహితులైన లాయర్స్ సలహాలు తీసుకుంటున్నట్లు టాక్. 

ఇలా ఉంటే ఈమూవీ ఘన విజయంతో అనేకమంది దర్శక నిర్మాతలు రామ్ చుట్టూ తిరుగుతున్నా ఈ ఇస్మార్ట్ ఎవరు చెప్పే కథలను వినడానికి ఇంకా ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు. దీనికితోడు రామ్ తాను భవిష్యత్ లో నటించే సినిమా సబ్జెక్ట్ మాస్ మసాలా మూవీగా ఉండాలా లేకుంటే ఏదైనా ఒక లవ్ స్టోరీని ఎంచుకోవాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు సమాచారం. 

అయితే పూరీ మటుకు రామ్ ను ఏదోవిధంగా ఒప్పించి ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ను వెంటనే మొదలు పెట్టాలి అని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. రామ్ విషయం ఎలా ఉన్నా ఈమూవీలో నటించిన నభా నాటేష్ నిధి అగర్వాల్ చుట్టూ చాలామంది నిర్మాతలు వారి డేట్స్ కోసం తిరుగుతున్నట్లు సమాచారం. ఒక సినిమా హిట్ నలుగురు జీవితాలను మలుపు తిప్పడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఇస్మార్ట్ శంకర్’ వార్తలే వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: